Advertisement

  • రోహిత్ అభిమానులకు శుభవార్త ..మైదానంలోకి దిగిన హిట్మాన్

రోహిత్ అభిమానులకు శుభవార్త ..మైదానంలోకి దిగిన హిట్మాన్

By: Sankar Thu, 25 June 2020 5:06 PM

రోహిత్ అభిమానులకు శుభవార్త ..మైదానంలోకి దిగిన హిట్మాన్



గత నాలుగు అయిదు నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉంటుంది టీమిండియా హిట్ మాన్ రోహిత్ శర్మ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పాడు ..చాలాకాలం తర్వాత తాను తిరిగి మైదానంలో సాధన ప్రారంభించినట్లు తెలిపాడు ..అయితే కేసులు అత్యంత ఎక్కువగా ఉన్న ముంబై లో రోహిత్ సాధన చేస్తుండటంతో అభిమానులు ఒకింత కలవర పాటుకు గురి అవుతున్నారు ..ఇప్పటికే చతేశ్వర్ పుజారా, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చాహర్, రాబిన్ ఉతప్ప తదితరులు తమ ప్రాక్టీస్‌ని ప్రారంభించారు.

అయితే అక్టోబర్లో జరిగే టి ట్వంటీ వరల్డ్ కప్ వాయిదా పడితే ఆ స్థానంలో ఐపీయల్ నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది ..దీనితో ఆటగాళ్లు ఒకొక్కరుగా తమ ప్రాక్టీస్ను మొదలు పెడుతున్నారు ..ఇంత సుదీర్ఘ కాలం క్రికెట్ కు దూరంగా ఉండటంతో మల్లి లయను అందుకోవాలి అంటే ఒక నెల రోజులు అయినా పెట్టె అవకాశం ఉంది అని కోచ్ లు అంటున్నారు దీనితో క్రికెటర్లు ఇప్పటినుంచే తమ సాధనను షురూ చేస్తున్నారు ..

కాగా న్యూజిలాండ్తో న్యూజిలాండ్ లో జరిగిన సిరీస్లో మధ్యలోనే గాయంతో వెనుదిరిగిన రోహిత్ ఆ తర్వాత లాక్ డౌన్ కావడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు ..దీనితో తన మునుపటి ఫామ్ అందుకోవాలని తహతహలాడుతున్నాడు .. గత కొన్నేళ్లుగా తన అసమాన ఆటతీరుతో టీమిండియా విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్ , లాక్ డౌన్ తర్వాత కూడా అదే స్థాయిలో రాణించాలని పట్టుదలతో ఉన్నాడు

Tags :
|
|

Advertisement