రోహిత్ శర్మ ఫిట్నెస్ టెస్ట్ లో పాస్...టెస్ట్ మ్యాచ్ లకు రెడీ...
By: chandrasekar Fri, 11 Dec 2020 10:20 PM
శుక్రవారం వైద్య బృందం
జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో రోహిత్ శర్మ
పాసయ్యాడు. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల
పర్యవేక్షణలో రోహిత్కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. రోహిత్ శర్మ ఫిట్నెస్
టెస్ట్ లో పాస్ కావడంతో డిసెంబర్ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ
విషయాన్ని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
రోహిత్ నిబంధనల ప్రకారం 14 రోజుల
క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. తొలి రెండు టెస్టులకు దూరం కానున్న
హిట్ మాన్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. మొదటి టెస్టు అనంతరం
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నీటి సెలవులపై స్వదేశానికి
రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్గా
వ్యవహరిస్తాడు. డిసెంబర్ 17నుంచి
ఆసీస్- భారత్ల మధ్య తొలి టెస్టు అడిలైడ్ లో జరగనుంది.