ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు రోహిత్ కు లైన్ క్లియర్
By: Sankar Fri, 11 Dec 2020 2:14 PM
హిట్ మాన్ రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్ ...ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లేందుకు రోహిత్ కు లైన్ క్లియర్ అయింది...నేడు బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడెమి లో జరిగిన ఫిట్నెస్ టెస్ట్ రోహిత్ పాసయ్యాడు.
నేషనల్ క్రికెట్ అకాడమీలో శుక్రవారం అతనికి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. ఐపీఎల్లో తొడ కండరాల గాయంతో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్కు రోహిత్ దూరమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫిట్నెస్ టెస్ట్ పాసవడంతో ఈ నెల 14న అతడు ఆస్ట్రేలియా విమానం ఎక్కనున్నాడు. అక్కడికి వెళ్లిన తర్వాత 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది.
ఆ లెక్కన సిడ్నీలో జనవరి 7న మొదలయ్యే మూడో టెస్ట్ నుంచి రోహిత్ అందుబాటులో ఉంటాడు. ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత వారం రోజుల పాటు ప్రాక్టీస్ చేయనున్నాడు. తొలి టెస్ట్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి తిరిగి ఇండియాకు రానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ టీమ్లో ఉండటం టీమిండియాకు చాలా ముఖ్యం.