Advertisement

  • టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించగల సామర్థ్యం అతడికే ఉంది ...కైఫ్

టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించగల సామర్థ్యం అతడికే ఉంది ...కైఫ్

By: Sankar Sat, 13 June 2020 3:44 PM

టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించగల సామర్థ్యం అతడికే ఉంది ...కైఫ్



అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోరు 172 పరుగులు.. ఈ రికార్డ్ ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ పేరిట ఉంది. ఇక ఓవరాల్‌గా టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా 175 పరుగులతో వెస్టిండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌గేల్ కొనసాగుతున్నాడు. ఈ రికార్డులని బట్టి చూస్తే టీ20ల్లో డబుల్ సెంచరీని కూడా మనం త్వరలోనే చూడబోతున్నాం అని అర్థమవుతోంది.

అయితే.. టీ20ల్లో ఫస్ట్ డబుల్ సెంచరీని అందుకోగల సామర్థ్యం ఉన్న క్రికెటర్ ఎవరు..? అంటే చాలా మంది నోటి నుంచి వినిపించే పేరు రోహిత్ శర్మ. మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా హిట్‌మ్యాన్‌కే ఓటేశాడు. ఇప్పటి వరకూ 108 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ.. 138.79 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 2,773 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 118.



rohit sharma,t20,kaif,double century,ability ,కైఫ్ ,  డబుల్ సెంచరీ ,  టీ20, సామర్థ్యం ,  రోహిత్ శర్మ



భారత అండర్-19 టీమ్ మాజీ కెప్టెన్ ప్రియమ్ గార్గె‌తో ఇటీవల హలో యాప్‌ ద్వారా మహ్మద్ కైఫ్ మాట్లాడుతుండగా.. టీ20ల్లో డబుల్ సెంచరీ గురించి చర్చ వచ్చింది. దాంతో.. రోహిత్ శర్మకి ఆ మైలురాయిని అందుకునే సామర్థ్యం ఉందని కితాబిచ్చిన కైఫ్.. టీ20ల్లో సెంచరీ తర్వాత రోహిత్ శర్మ స్ట్రైక్‌రేట్‌ పతాక స్థాయిలో ఉంటోందని గుర్తుచేశాడు. వన్డేల్లో ఇప్పటికే రోహిత్ శర్మ మూడు డబుల్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.

‘‘టీ20ల్లో డబుల్ సెంచరీ సాధించగల సామర్థ్యం రోహిత్ శర్మకి ఉంది. ఎందుకంటే.. అతని స్ట్రైక్‌రేట్ మ్యాచ్ జరిగేకొద్దీ క్రమంగా పెరుగుతూ పోతుంది. కొన్నిసార్లు అతను నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినా.. శతకం తర్వాత మాత్రం అతని స్ట్రైక్‌రేట్ 250-300 మధ్యలో ఉంటుంది. కాబట్టి.. రోహిత్ కచ్చితంగా డబుల్ సెంచరీ మైలురాయిని అందుకోగలడు. నేను క్రికెట్ ఆడే రోజుల్లో టీమ్ 200-250 పరుగులు చేయడమే కష్టంగా ఉండేది. కానీ.. ఇప్పుడు 400-500 స్కోర్లు గురించి మాట్లాడుకుంటున్నారు’’ అని కైఫ్ వెల్లడించాడు.

Tags :
|
|

Advertisement