Advertisement

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రోహిత్...

By: chandrasekar Wed, 11 Nov 2020 8:08 PM

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రోహిత్...


ముంబై ఇండియాన్స్ సారథి రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో చేర్చాడు. ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​లో 200 మ్యాచ్​లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్​ ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్​తో ఆడిన ఐపీఎల్​ ఫైనల్​ మ్యాచ్​లో ఈ మైలురాయిని రాహుల్ చేరుకున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి దక్కన్​ ఛార్జర్స్​, ముంబై ఇండియన్స్​ జట్లకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్​.. 39 హాఫ్​ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు ముంబై ఇండియన్స్​ తరపున హిట్​మ్యాన్​కు ఇది 155వ మ్యాచ్​.

ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన లీగ్ను మ్యాచ్​తో రోహిత్​ తన 150వ ఐపీఎల్ మ్యాచ్​ను ఆడాడు. ఐపీఎల్​లో 200 మ్యాచ్​లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​ ధోనీ రికార్డు సృష్టించాడు. ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018 సీజన్లలో విజేతగా నిలిచింది. ధోనీ ఆడిన 204 ఐపీఎల్​ మ్యాచ్​లలో 4,632 పరుగులను నమోదు చేయగా.. అందులో 23 అర్ధశ తకాలున్నాయి. అత్యధికంగా 84 రన్స్​ చేశాడు ధోనీ.

Tags :
|
|
|
|
|

Advertisement