సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన రోహిత్...
By: chandrasekar Wed, 11 Nov 2020 8:08 PM
ముంబై ఇండియాన్స్ సారథి
రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో చేర్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 200
మ్యాచ్లు ఆడిన రెండో ఆటగాడిగా రోహిత్ ఘనత సాధించాడు. దుబాయ్ వేదికగా ఢిల్లీ
క్యాపిటల్స్తో ఆడిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఈ మైలురాయిని రాహుల్ చేరుకున్నాడు.
టోర్నీ ప్రారంభం నుంచి దక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించిన
రోహిత్.. 39 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ తరపున హిట్మ్యాన్కు ఇది 155వ
మ్యాచ్.
ఢిల్లీ క్యాపిటల్స్తో
జరిగిన లీగ్ను మ్యాచ్తో రోహిత్ తన 150వ
ఐపీఎల్ మ్యాచ్ను ఆడాడు. ఐపీఎల్లో 200 మ్యాచ్లు పూర్తి చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
కెప్టెన్ ధోనీ రికార్డు సృష్టించాడు. ధోనీ నేతృత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018 సీజన్లలో విజేతగా నిలిచింది. ధోనీ ఆడిన 204
ఐపీఎల్ మ్యాచ్లలో 4,632 పరుగులను నమోదు చేయగా.. అందులో 23 అర్ధశ
తకాలున్నాయి. అత్యధికంగా 84 రన్స్ చేశాడు ధోనీ.