గాయం నుంచి కోలుకుంటే రోహిత్ ఆస్ట్రేలియా టూర్ కి వెళ్తాడు...సౌరవ్ గంగూలీ
By: Sankar Tue, 03 Nov 2020 6:04 PM
విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. తొడకండరాల గాయం కారణంగా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆసీస్ టూర్కు బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
రోహిత్ గాయం తీవ్రతపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం, బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఐపీఎల్లోనే గాయపడ్డ ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం సమీక్షిస్తున్నదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తెలిపాడు. వీరిద్దరిని ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పాడు.
'ఇషాంత్, రోహిత్ గాయాలను క్షుణ్నంగా పర్యవేక్షిస్తున్నాం. ఇషాంట్ టెస్టు సిరీస్లో భాగమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా టూర్కు రోహిత్ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాలనుకుంటున్నాం. ఒకవేళ అతడు ఫిట్గా ఉంటే జట్టులో అతని స్థానంపై సెలక్టర్లు పునరాలోచించుకుంటారని నేను అనుకుంటున్నానని' గంగూలీ పేర్కొన్నాడు