Advertisement

రోహిణి కోర్ట్ న్యాయమూర్తికి కరోనా

By: Sankar Wed, 03 June 2020 4:51 PM

రోహిణి కోర్ట్ న్యాయమూర్తికి కరోనా

కరోనా దేశంలో విజ‌ృంభిస్తూనే ఉంది. ఎంతో మంది సామాన్యులతో పాటు.. రాజకీయ, సినీ ప్రముఖులుసైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కేసులు ఎక్కువగా రికార్డవుతున్నాయి. తాజాగా..రోహిణి కోర్టు జడ్జికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. ముందుగా జడ్జీ భార్యకు కరోనా వచ్చింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. జడ్జికి కూడా వైరస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. వీరిద్దరూ.. ప్రస్తుతం క్వారంటైన్ కు వెళ్లారని రోహిణి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహవీర్ సింగ్ వెల్లడించారు.


జడ్జికి కరోనా ఉందనే వార్త వైరల్ అయ్యింది. అధికారులు అలర్ట్ అయ్యారు. రోహిణి కోర్టు కాంప్లెక్స్ ను శానిటైజ్ చేశారు. జడ్జితో సన్నిహితంగా ఉన్న నలుగురు జడ్జిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టుకు రావాలంటేనే న్యాయవాదులు, ఇతర జడ్జిలు, కక్షిదారులు జంకుతున్నారు. దీనికి ఇంకా మందు కనిపెట్టకపోతుండడంతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసులు అమాంతం పెరుగుతున్నాయి.

గత 24 గంటల్లో భారత్ లో 8909 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 217 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,07,615 కేు చేరగా మృతుల సంఖ్య 5815 కు చేరింది. ఇప్పటి వరకు 100303 మంది కరోనా నుంచి కోలుకోగా ..101497 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 72300 కరోనా కేసులు నమోదవ్వగా 2465 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ కరోనా కేసుల్లో మూడవ స్థానంలో ఉంటుంది. రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో 24,586 మంది కరోనా బాధితులు ఉన్నారు. 22,132 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది.



Tags :
|
|
|
|
|

Advertisement