Advertisement

ఆ రాష్ట్రంలో ఎన్నికల విధులలో రోబోలు ..

By: Sankar Thu, 10 Dec 2020 8:34 PM

ఆ రాష్ట్రంలో ఎన్నికల విధులలో రోబోలు ..


దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి ..కరోనా తీవ్ర స్థాయిలోనే ఉన్నప్పటికీ అనేక జాగ్రత్తల మధ్య రాష్ట్రాలు ఎన్నికలను నిర్వహిస్తున్నాయి ..ఇప్పటికే తెలంగాణాలో దుబ్బాక , జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగాయి , ఏపీలో కూడా స్థానిక సమస్థల ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి...ఇలా అన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి..

అయితే అన్నింటికంటే డిఫెరెంట్ గా కేరళ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎర్నాకుళంలోని కమ్యూనిటీ హాల్ లో ఎన్నికల విధుల కోసం రోబోట్ ను ఏర్పాటు చేశారు. ఈరోబో ఓటర్లకు శానిటైజర్ చేస్తూ నిబంధనల గురించి నిత్యం హెచ్చరిస్తోంది. మాస్క్ పెట్టుకోకుంటే అలర్ట్ చేస్తున్నది.

లైన్లో ఉండాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఓటర్లను కోరింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా రోబో విధులు నిర్వహించింది. దేశంలో మొదటిసారిగా ఎన్నికల కోసం రోబోను ఎర్నాకుళంలో వినియోగించినట్టు అధికారులు చెప్తున్నారు.

Tags :
|
|

Advertisement