గుంటూరు జిల్లాలో రోడ్డు పక్కన కలకలంరేపిన కరెన్సీ కట్టల వ్యవహారం....!
By: chandrasekar Tue, 20 Oct 2020 7:28 PM
వెంగళాయపాలెం దగ్గర
హైవేపై ఓ బ్యాగ్ కనింపించింది. స్థానికులు భయంతో పోలీసులకు సమాచారం అందిండ౦తో
వెంటనే అక్కడికి చేరుకుని బ్యాగును పరిశీలించారు. అందులో రెండు వేలు, ఐదు
వందల నోట్లు కనిపించాయి.
వెంటనే ఆ బ్యాగును
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది నకిలీ కరెన్సీగా గుర్తించారు. అలాగే రెండు
వేల నోటుపై చిల్డ్రన్స్ కరెన్సీ అనే ముద్రను పోలీసులు గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తులు
నకిలీ కరెన్సీ బ్యాగును వెంగళాయపాలెం దగ్గర హైవేపై వదిలి వెళ్లిపోయినట్లు
తెలుస్తోంది. కరెన్సీ మొత్తం 2.5 కోట్ల రూపాయలు ఉన్నట్టు గుర్తించారు.
పోలీసులు కేసు నమోదు చేసి
దర్యాప్తు చేస్తున్నారు. ఆ బ్యాగును
రోడ్డుపై ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నకిలీ
కరెన్సీ దొరకడం కలకలంరేపుతోంది.
ఇటీవలే జిల్లాలో పోలీసులు
నకిలీ కరెన్సీ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఇప్పుడు ఈ నకిలీ కరెన్సీ
వ్యవహారం చర్చనీయ౦గా మారింది.