మహబూబ్నగర్లో బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
By: chandrasekar Wed, 12 Aug 2020 4:57 PM
మహబూబ్నగర్ జిల్లాలో
జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు, బైకులు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.
మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటన మహబూబ్నగర్
జిల్లాలో బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, రెండు
బైకులను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జడ్చర్లకు చెందిన
శ్రీనివాస్గౌడ్, శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రంగా గాయపడిన రాజుని
చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :
national |
highway |