Advertisement

  • మహబూబ్‌నగర్‌లో బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

మహబూబ్‌నగర్‌లో బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

By: chandrasekar Wed, 12 Aug 2020 4:57 PM

మహబూబ్‌నగర్‌లో బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం


మహబూబ్‌నగర్ జిల్లాలో జడ్చర్ల మండలం బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు, బైకులు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో బురెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు, రెండు బైకులను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో జడ్చర్లకు చెందిన శ్రీనివాస్‌గౌడ్, శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తీవ్రంగా గాయపడిన రాజుని చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

Advertisement