Advertisement

  • చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్‌లోనే ముగ్గురి మృతి

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్‌లోనే ముగ్గురి మృతి

By: chandrasekar Tue, 03 Nov 2020 7:04 PM

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్‌లోనే ముగ్గురి మృతి


చిత్తూరు జిల్లాలోని మదనపల్లె- పుంగనూరు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా బస్సులోని మరో 20 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.

గాయపడిన వారిని మదనపల్లెలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారిలో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :
|
|

Advertisement