చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం... స్పాట్లోనే ముగ్గురి మృతి
By: chandrasekar Tue, 03 Nov 2020 7:04 PM
చిత్తూరు జిల్లాలోని
మదనపల్లె- పుంగనూరు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న
ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే మృతి
చెందగా బస్సులోని మరో 20 మందికి తీవ్రగాయాలైనట్లు సమాచారం.
గాయపడిన వారిని
మదనపల్లెలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలపాలైన వారిలో కొంత మంది పరిస్థితి
ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే
సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
మరణించిన వారి మృతదేహాలను
పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ
చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :
road |
acciden |
t |