Advertisement

ఘోర రోడ్డు ప్రమాదం... 4 దుర్మరణం

By: Anji Sun, 30 Aug 2020 2:25 PM

ఘోర రోడ్డు ప్రమాదం... 4 దుర్మరణం

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారు పాలెం మండలం మొగలి దగ్గర లారీ బైక్‌ను ఢీకొట్టగా.. ఆ వెనుకే వచ్చిన కారు లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.. వీరిలో ముగ్గురు కారులో ఉన్నారు. అలాగే బైక్‌పై వెళుతున్న వ్యక్తి కూడా చనిపోయాడు.

మృతుల్లో ముగ్గురు నెల్లూరు వాసులు.. వారు బెంగుళూరు నుంచి కారులో నెల్లూరు వెళుతున్నారు. ప్రమాదానికి గురైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌కు సంబంధించింది అని స్థానికులు చెబుతున్నారు.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది.

కారు అతి వేగంతో వస్తున్నట్లు తెలుస్తోంది.. నేరుగా లారీ కిందుకు దూసుకెళ్లడంతో ముగ్గురు చనిపోయారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. డెడ్‌బాడీలను పోస్ట్ మార్టమ్ కోసం ఆస్పత్రి తరలించారు.

Tags :

Advertisement