Advertisement

  • బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్..!

By: Anji Sat, 03 Oct 2020 10:41 PM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్..!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ప్రతిపక్ష కూటమి ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ 70 సీట్లకు పోటీ చేయనున్నాయి.

లెఫ్ట్ పార్టీలకు 29 సీట్లు ఇఛ్చారు. సీపీఐ (ఎంఎల్ ) 19 సీట్లలోను, సీపీఐ 6, సీపీఎం 4 స్థానాల్లో పోటీకి దిగుతాయి. ఇక ఈ మహా కూటమికి తేజస్వి యాదవ్ నేతృత్వం వహించనున్నారు. ఈ నెల 28 నుంచి మూడు దశల్లో రాష్ట్ర శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి.

Tags :
|
|
|

Advertisement