Advertisement

ధోని వారసుడు వస్తున్నాడు ...రాబిన్ ఉతప్ప

By: Sankar Sat, 30 May 2020 11:18 AM

ధోని వారసుడు వస్తున్నాడు ...రాబిన్ ఉతప్ప

ఇండియన్ క్రికెట్ లో ధోని స్థానం ప్రత్యేకం ..ఇండియన్ క్రికెట్ ఉన్నంతకాలం ధోని పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది ..ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కానీ అనేక రికార్డులను ధోని తన కాతాలో వేసుకున్నాడు...అయితే ధోని రిటైర్మెంట్ దగ్గర పడటంతో ధోని తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం టీం ఇండియా అనేక ప్రయత్నాలు చేస్తుంది..కానీ ఎవ్వరు కూడా ధోని దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నారు...అయితే త్వరలోనే ఇండియన్ టీం లో ధోని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని చూస్తారని టీం ఇండియా ఆటగాడు రాబిన్ ఉతప్ప అన్నాడు ..

riyan parag,ms dhoni,robin uthappa,finisher,indian cricket

ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న లెగ్‌ స్పిన్నర్‌, అస్సాం క్రికెటర్‌ రియాన్‌ పరాగ్‌లో ధోని తరహా లక్షణాలు ఉన్నాయన్నాడు.బ్యాటింగ్‌ పరంగా గొప్ప మ్యాచ్‌ ఫినిషింగ్‌ లక్షణాలు పరాగ్‌లో ఉన్నాయన్నాడు. తాజాగా క్రిక్‌ఫిట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రాబిన్‌ ఊతప్ప పలు విషయాలను షేర్‌ చేసుకున్నాడు. అందులో ధోని తర్వాత మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్ర ఎవరు పోషించబోతున్నారనే దానికి ఊతప్ప సమాధానం చెప్పాడు. ‘ ధోనికి స్థానానికి రియాన్‌ పరాగ్‌ సమాధానం అవుతాడు. ప్రస్తుతం పరాగ్‌ బ్యాటింగ్‌ చూస్తుంటే ఒక మంచి అనుభూతి కలుగుతుంది..

ఇండియన్ క్రికెట్ కు నెక్స్ట్‌ ఎంఎస్‌ ధోని అతడే. త్వరలోనే 18 ఏళ్ల రియాన్‌ పరాగ్‌ భారత జట్టులో అరంగేట్రం చేయడం ఖాయం. నా ప్రకారం చూస్తే అతను భారత క్రికెట్‌ జట్టుకు సుదీర్ఘ కాలం ప్రాతినిథ్యం వహిస్తాడు. అతనిలో గొప్ప ఫినిషింగ్‌ లక్షణాలున్నాయి’అని ఊతప్ప తెలిపాడు. 2019 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరుఫున ఈ లీగ్‌లో పరాగ్‌ అరంగేట్రం చేశాడు. అదే సమయంలో గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ఊతప్పను రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

Tags :

Advertisement