సుశాంత్ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన రియా చక్రవర్తి
By: chandrasekar Tue, 14 July 2020 6:37 PM
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్
సింగ్ రాజ్పుత్ తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడిన సుశాంత్ మరణనాన్ని నేటికీ కొందరు
సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ లోకం విడిచి వెళ్లి నెలా
రోజులు గడిచిన సందర్భంగా అతనితో జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది
సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి.
సుశాంత్తో దిగిన ఫోటోలని
షేర్ చేస్తూ ఆయనతో గడిపిన కాలాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది రియా.
జీవితాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో నేర్పించిన నిన్ను కోల్పోవడంతో నా హృదయానికి
కోలుకోలేని దెబ్బ తగిలిందని పేర్కొంటూ తన ఇన్స్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్
పెట్టింది రియా చక్రవర్తి. నువ్వు ఇక నా దగ్గరకి రావని తెలుసంటూ భావోద్వేగ
పూరిత కామెంట్ చేసింది.
'నువ్వు లేవని తెలిసిన ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు నా
ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా హృదయానికి తగిలిన గాయం నేటికీ
కాస్తయినా మానలేదు. ప్రేమపై నమ్మకం కలిగించి, జీవిత పాఠాలు చెప్పిన వ్యక్తివి నువ్వే. అందంతో పాటు
అణుకువ గల వ్యక్తివి నువ్వు. ఇప్పుడు మరో లోకంలో చాలా ప్రశాంతంగా ఉండి ఉంటావు.
చందమామ, నక్షత్రాలు, గెలాక్సీలు
ఈ గొప్ప భౌతిక శాస్త్రవేత్తను హృదయపూర్వకంగా ఆహ్వానించి ఉంటాయి. ప్రశాంతంగా ఉండు
సుశీ. నిన్ను కోల్పోయి 30 రోజులు పూర్తయ్యాయి. కానీ, జీవితాంతం
నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను'' అని రియా తన పోస్ట్లో పేర్కొనడం అందరిచేత కన్నీళ్లు
పెట్టిస్తోంది.
మరోవైపు సుశాంత్
ఆత్మహత్యపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఆయన మరణంపై కేసు నమోదు చేసిన ముంబై
పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఐదుగురితో కూడిన అధికారుల టీం ఇప్పటికే
దాదాపు 35
మందిని విచారించారు.