కోపంతో సెంచరీ కొట్టాను ...రిషబ్ పంత్
By: Sankar Mon, 14 Dec 2020 1:28 PM
టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ తో తొలి టెస్ట్ కు మంచి ప్రాక్టీస్ లభించింది...ఒకరు ఇద్దరు మినహా బ్యాట్సమెన్ మరియు బౌలర్లు అందరు రాణించారు..అన్నిటికంటే ముఖ్యంగా టీమిండియాకు పెద్ద సానుకూలాంశం రిషప్ పంత్ సెంచరీతో చెలరేగడం...గత కొంతకాలంగా పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొన్న పంత్.. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో సిడ్నీ వేదికగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కేవలం 73 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్స్లతో అజేయంగా 103 పరుగులు చేశాడు..
కాగా, మ్యాచ్లో రెండో రోజైన శనివారం చివరి ఓవర్ని వ్యక్తిగత స్కోరు 81 పరుగుల వద్ద ఎదుర్కొన్న రిషబ్ పంత్.. ఆ ఓవర్లో ఆఖరి ఓవర్లో 22 పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేయడం విశేషం. విల్డర్ముత్ వేసిన ఆఖరి ఓవర్ మొదటి బంతి అతని పొట్టలో బలంగా తగిలింది. అనంతరం తర్వాతి ఐదు బంతుల్లో 4, 4, 6, 4, 4 బాదిన పంత్ 73 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీపై బీసీసీఐ అధికారిక వెబ్సైట్తో పంత్ మాట్లాడాడు.
‘నేను చివరి ఓవర్లో 20 పరుగులు చేస్తే సెంచరీ చేస్తాననుకున్నా. కానీ తొలి బంతే నా పొట్టలో బలంగా తగలింది. దాంతో నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇక హిట్టింగ్కు దిగాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో విహారి కూడా నాకు సపోర్ట్గా నిలిచాడు. నువ్వు ట్రై చేస్తే సెంచరీ చేస్తావని చెప్పాడు. నేను తప్పకుండా ట్రై చేస్తానని చెప్పా. ఒకవేళ సెంచరీ చేస్తే అంతకంటే మంచిది ఉండదనుకున్నా. దాంతో హిట్టింగ్కు దిగి ఆ లక్ష్యాన్ని చేరుకున్నా’ అని పంత్ తెలిపాడు..