ప్రస్తుత T20 క్రికెట్ లో అతడే అత్యుత్తమ ఆటగాడు ..రికీ పాంటింగ్
By: Sankar Thu, 17 Sept 2020 11:50 AM
ఎట్టకేలకు ఐపీయల్ పదమూడవ సీజన్ మరోక రెండు రోజుల్లో ప్రారంభం కానుంది..ఇప్పటికే అన్ని జట్లు తీవ్ర సాధనలో మునిగాయి..దీనితో అందరు ఈ సారి జట్ల బలాబలాల మీద అంచనాలు వేస్తున్నారు..ఎందుకంటే ఈ సారి ఐపీయల్ జరిగేది యూఏఈ లో కావడంతో పిచ్ లు ఎలా ఉంటాయి ఎవరికీ అనుకూలిస్తాయి అని అంచనాలు వేసుకుంటున్నారు..తాజాగా ప్రస్తుత టీ 20 క్రికెట్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మనే అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు.
రికీ పాంటింగ్ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడు. మొంబై ఇండియన్స్లో ప్రమాదకర ఆటగాడు ఏవరనే ప్రశ్నకు సమాధానమిస్తు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అని పాంటింగ్ సమాధానమిచ్చాడు. రోహిత్ తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కొనసాగిస్తున్నట్లు పాంటింగ్ పేర్కొన్నాడు.
కాగా రోహిత్ సారథ్యంలో ఇప్పటికే నాలుగు ఐపీయల్ టైటిల్స్ సాధించి ఐపీయల్ చరిత్రలోనే ఆ ఘనత సాధించిన మొదటి జట్టుగా కొనసాగుతున్నా ముంబై ఇండియన్స్ మరొక టైటిల్ మీద కన్నేసింది...ఇందులో భాగంగా ప్రారంభ మ్యాచ్ లో మరోక పటిష్ట జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది...అయితే బలాబలాల ప్రకారం చూసుకుంటే చెన్నై కంటే ముంబై జట్టు కొంచెం పటిష్టంగా కనిపిస్తుంది ..కానీ ఐపీయల్ లో ముంబై ఇండియన్స్ కు ఇంతవరకు ఫస్ట్ మ్యాచ్ అంతగా కలిసి రాలేదు..దీనితో ఈ సారి ఎవరు గెలుస్తారా అని అభిమానులు ఎదురు చుస్తునారు