Advertisement

  • మర్డర్ సినిమా మీద కేసుపై స్పందించిన వర్మ ..

మర్డర్ సినిమా మీద కేసుపై స్పందించిన వర్మ ..

By: Sankar Sun, 05 July 2020 1:26 PM

మర్డర్ సినిమా మీద కేసుపై స్పందించిన వర్మ ..



సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మర్డర్ పేరుతో సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే ..అయితే సినిమా కథ అమృత ప్రణయి , మారుతీ రావు ల నిజ జీవితానికి దగ్గరగా ఉన్నట్లు అమృత వర్మ మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే..అయితే దీనిపై వర్మ స్పందిస్తూ నేను కేవలం కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకోని సినిమా తీస్తున్నాను తప్ప ఎవరి మీద సినిమా తీసే ఉద్దేశం లేదు అన్నాడు.

అయితే మర్డర్ సినిమా మీద తాజాగా ప్రణయ్ తండ్రి బాలస్వామి మిర్యాలగూడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు.మర్డర్ సినిమాకోసం ప్రణయ్‌, అమృత, మారుతీరావు ఫొటోలను వాడారని , ఈ సినిమా వలన ప్రణయ్ హత్యా కేసు ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అని అన్నారు.

దీంతో కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన వర్మ ట్విట్టర్ వేదికగా షాకింగ్ రిప్లై ఇచ్చారు. ''నా మర్డర్ సినిమాపై కేసు నమోదైన నేపథ్యంలో మరోసారి చెబుతున్నా. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది తప్ప వాస్తవం కాదు. అదేవిధంగా ఏ ఒక్క కుల ప్రస్తావనను ఈ సినిమాలో తీసుకురాలేదు'' అని తెలిపారు.

Tags :
|
|
|
|
|

Advertisement