కంగనా సోకిన శివసేనకు వ్యాక్సిన్ లేదు ..వ్యంగ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ
By: Sankar Wed, 09 Sept 2020 7:33 PM
బాలీవుడ్ పరిశ్రమలో మహారాష్ట్ర వర్సెస్ కంగనా రనౌత్ విషయం హాట్ టాపిక్ గా మారింది. మహా సర్కార్ అధికార పార్టీ నేతలు... కంగన మహారాష్ట్రలో అడుగు పెట్టవద్దంటూ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ విషయం సంచలనంగా మారింది. శివసేన నేతలకు దీటుగా కంగన సైతం కామెంట్లు చేసింది.
ఇక ఈ వివాదంపై సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించాడు. ఖచ్చితంగా మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కంగనా రనౌత్ అవుతుందనిపిస్తోందని అన్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే బాలీవుడ్ వాళ్లందరూ టింబక్టుకు మకాం మార్చాలంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసారు. అంతే కాకుండా కరోనా సోకిన భారత్కు వ్యాక్సిన్ లేదని, అలాగే కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్ లేదని పేర్కొన్నారు.
ఇక సుశాంత్ మరణం తర్వాత కంగనా తీవ్ర స్థాయిలో ఫైర్ అయితుంది..ముందుగా సుశాంత్ మరణం మీద బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది..