Advertisement

నేరస్థుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి

By: chandrasekar Sat, 29 Aug 2020 12:18 PM

నేరస్థుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి


పోలీసులు గాంధీ ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన ఖైదీల పై రివార్డు ప్రకటించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న నలుగురు నేరస్థులు మంగ‌లి సోమ సుందర్, ప‌ర్వ‌తం నరసింహ, ఎమ్‌డీ అబ్దుల్ అర్భాజ్, ఎమ్‌డీ జావిద్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేసారు.

అందువల్ల పోలీసులు వారిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ గురువారం నాడు గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డ్ నుండి బాత్రూం కిటికీ ద్వారా నిందితులు నలుగురూ పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తప్పించుకుపోయిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తప్పించుకుపోయిన నేరస్థుల ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామ‌ని పోలీసులు వారి ఫోటోల‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ఆచూకీ తెలిపిన‌ వారి వివరాలను సైతం గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

Tags :
|
|
|

Advertisement