Advertisement

సీఎం కేసీఆర్‌ కరోనా ఆర్థిక నష్టంపై సమీక్ష...

By: chandrasekar Sat, 07 Nov 2020 10:18 AM

సీఎం కేసీఆర్‌ కరోనా ఆర్థిక నష్టంపై సమీక్ష...


తెలంగాణకు కరోనా మహమ్మారి కారణంగా జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో సమీక్ష జరుగనుంది.

2020-2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష జరుపనున్నారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై, సవరించుకోవాల్సిన అంశాలపై వివరంగా చర్చించనున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఆర్థికశాఖ అధికారులు సమీక్షకు హాజరుకున్నారు.

శనివారం సమీక్షలో వచ్చే అంచనాలపై ఆదివారం మంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్‌ సమావేమయ్యే అవకాశం ఉంది.

Tags :
|
|
|
|

Advertisement