అక్టోబర్లో 7.61 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం
By: chandrasekar Fri, 13 Nov 2020 4:19 PM
న్యూఢిల్లీ: ఆహార ధరల
పెరుగుదలతో రిటైల్ ద్రవ్యోల్బణం మరింత ఎగబాకింది.
గురువారం కేంద్ర
ప్రభుత్వం విడుదల చేసిన వినిమయ ధరల సూచీ గణాంకాల ప్రకారం సెప్టెంబర్లో 7.27
శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్లో 7.61 శాతానికి పెరిగింది.
గతేడాది అక్టోబర్లో ఇది 4.62
శాతంగా ఉన్నది. మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్లో 10.68 శాతంగా ఉన్న వినిమయ ఆహార
ధరల సూచీ (సీపీఎఫ్ఐ) అక్టోబర్లో 11.07
శాతానికి పెరిగింది.
Tags :
retail |
per cent |