- హోమ్›
- వార్తలు›
- నా భర్త అర్ణబ్ గోస్వామి ప్రాణాలకు ముప్పు ఉంది ...సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించిన అర్ణబ్ భార్య
నా భర్త అర్ణబ్ గోస్వామి ప్రాణాలకు ముప్పు ఉంది ...సుప్రీమ్ కోర్ట్ ను ఆశ్రయించిన అర్ణబ్ భార్య
By: Sankar Sun, 08 Nov 2020 4:04 PM
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి ప్రాణానికి ముప్పు ఉంది. కస్టడీ సమయంలో పోలీసులు విచక్షణ మరిచి ప్రవర్తించారు.
అర్నబ్ అరెస్టయి ఇప్పటికే 4 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో గడిపారు. జైలులో ఉన్న సమయంలో జైలర్ తనపై దాడి చేశారని, తన ప్రాణానికి ముప్పు ఉందని అర్నబ్ పదేపదే చెప్తున్నాడు. ఈ విషయంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని’ అర్నాబ్ భార్య సమ్యాబ్రతా రే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి శారీరకంగా హింసించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి స్పష్టంగా తీసుకెళ్లినప్పటికీ, ఎటువంటి జోక్యం చేసుకోలేదు. అర్నాబ్ తన ప్రాణానికి ముప్పు ఉందని, పోలీసుల అదుపులో తాను ఎదుర్కొంటున్న దారుణాలను బహిరంగంగా వెల్లడించారు. నా భర్తకు ఏదైనా హాని జరిగితే పోలీస్ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. జవాబుదారీతనాన్ని కోరిన ఓ జర్నలిస్టును శిక్షించడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలపై సుప్రీం కోర్టు దృష్టి సారించాలని నేను వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను' అంటూ సమ్యాబ్రాతా రే సుప్రీం కోర్టును కోరారు.