SBI ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీల సంఖ్య 2000..
By: chandrasekar Mon, 16 Nov 2020 8:33 PM
స్టేట్ బ్యాంక్ ఆఫ్
ఇండియాలో ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ
కోసం ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 2000. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI
జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్
పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. మొత్తం 2000
ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్కి
కేటాయియించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ప్రారంభమైంది. అప్లై
చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ గా ప్రకటించారు. ఇందుకోసం ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ
ద్వారా ఎంపిక చేస్తారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆన్లైన్
ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 31,
జనవరి 2,
4, 5 తేదీల్లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే
సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు
కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి
వివరాలను https://bank.sbi/web/careers
లేదా https://www.sbi.co.in/careers
వెబ్సైట్స్లో తెలుసుకోవచ్చు.
ప్రొబెషనరీ ఆఫీసర్
పోస్టుల ఉద్యోగాల ఖాళీల వివరాలు మొత్తం ఖాళీలు- 2000, ఎస్సీ- 300, ఎస్టీ-
150, ఓబీసీ-
540, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్- 200, జనరల్-
810. ఈ
ఉద్యోగాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 నవంబర్ 14 మరియు
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ- 2020 డిసెంబర్ 4. ప్రిలిమినరీ హాల్ టికెట్స్ డౌన్లోడ్- 2020
డిసెంబర్ మూడోవారం, ఫేజ్ 1 ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2020
డిసెంబర్ 31, 2021 జనవరి 2,
4, 5. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2021 జనవరి
మూడో వారం. మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్- 2021 జనవరి మూడో వారం. ఫేజ్ 2 ఆన్లైన్
మెయిన్ ఎఘ్జామ్- 2021 జనవరి 29.
మెయిన్ ఫలితాల విడుదల- 2021
ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం. ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్లోడ్- 2021
ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం. ఫేజ్ 3 ఇంటర్వ్యూ లేదా గ్రూప్ ఎక్సర్సైజెస్- 2021
ఫిబ్రవరి లేదా మార్చి. తుది ఫలితాల విడుదల- 2021 మార్చి చివరి వారం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
కమ్యూనిటీ అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్లోడ్- 2020
డిసెంబర్ రెండోవారం. ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2020 డిసెంబర్ మూడోవారం లేదా నాలుగో వారం.
ఇందుకోసం
విద్యార్హతలుగా ఏదైనా డిగ్రీ పాస్
అయివుండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు
చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి. వయస్సు- 2020 ఏప్రిల్
4
నాటికి 21 ఏళ్ల
నుంచి 30
ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ
అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు-
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ
అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. ఇందు కోసం పరీక్షా
కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.
ఇందుకోసం నిరుద్యోగులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలి.