రేణూ దేశాయ్ సంచలన కామెంట్స్
By: chandrasekar Tue, 11 Aug 2020 7:08 PM
ఆమె టాలెంట్ గురించి
ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
హీరోయిన్ రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్ చేసింది.
స్త్రీవాదం, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ సుదీర్ఘ పోస్ట్
పెట్టింది. ఈ పోస్ట్ ద్వారా తన మనసులోని భావాలను తెలియజేస్తూ సమాజంలో మహిళ స్థానం
ఏంటి? అనే
దానిపై విశ్లేషించింది. దీంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. పవన్
కళ్యాణ్తో డైవర్స్ తర్వాత సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తన
కూతురు, కొడుకు
విశేషాలను తెలుపుతోంది రేణు. అలాగే కవితలు, పోస్టుల రూపంలో తన భావాలను బయటపెడుతూ సోషల్ మీడియా
క్వీన్ అనిపించుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆలోచనలు రేకెత్తించే ఓ పోస్ట్ పెట్టి
సంచలనం సృష్టించింది రేణు దేశాయ్.
''ఈ సమాజంలో ఎంతోమంది దృష్టిలో నేను ఒంటరి మహిళను, సింగిల్
పేరెంట్ని. అందరిలాంటి ఆడదాన్ని కాదు. పురుషుల ప్రపంచంలో తాను అనుకున్నట్లుగా, తన
నిబంధనలపై జీవించే స్త్రీని. భర్త మద్దతు లేకుండా తన పిల్లలను సంపూర్ణంగా
పెంచుకునే తల్లిని. తన కాళ్లపై తాను నిలబడి, వ్యాపారం చేసుకుని, ఆర్థికంగా బలపడగలిగే
సామర్థ్యం ఉన్న మహిళని. అలాగే అన్యాయాలను గట్టిగా ఎదిరించే ఆడదాన్ని. సమాజంలోని
పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉండటానికి ఇష్టపడని ఓ స్త్రీని. కానీ ఇవ్వన్నీ
ఎలాంటి కారణాలు లేకుండా నాపై ఉన్న అనుపయుక్త అభిప్రాయాలు. అయితే స్వతంత్య్ర
ఆలోచనలతో బ్రతకాలని, నన్ను అనుసరించే యంగ్ గర్ల్స్ అందరికీ నేను చెప్పేది
ఒక్కటే.
మీకంటూ ఓ ప్రత్యేక
దృక్పథం కలిగి ఉండటం మంచిదే. వేరొకరి కుమార్తెగా లేదా భార్యగా ఉండటం మీ అసలైన
గుర్తింపు కాదు. మీ లైఫ్లో మీరే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. అలాగని సాంప్రదాయ
విలువలను అగౌరవపర్చడం స్త్రీ వాదం కాదు. కుటుంబ సంప్రదాయాల ముసుగులో శతాబ్దాలుగా
జరుగుతున్న అన్యాయానికి అండగా నిలబడటమే స్త్రీ వాదం. ఇకనైనా మీ మీ బలాలు, వ్యక్తిగత
సామర్థ్యాలను నమ్మడం ప్రారంభించండి. దుర్గాదేవీ, లక్ష్మీ, సరస్వతిలా
ఉండండి. ఆ ముగ్గురిలో ఉన్న లక్షణాలను అలవర్చుకోండి. మీకంటూ ఓ ప్రత్యేక జీవితం
ఉంది. దానిని సమర్థవంతంగా అనుభవించండి'' అని రేణూ దేశాయ్ తన పోస్ట్లో పేర్కొంది.