Advertisement

  • ప్రముఖ తెలుగు మరియు కన్నడ సినిమా సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత

ప్రముఖ తెలుగు మరియు కన్నడ సినిమా సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత

By: chandrasekar Mon, 12 Oct 2020 8:45 PM

ప్రముఖ తెలుగు మరియు కన్నడ సినిమా సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత


తెలుగు మరియు కన్నడ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. బెంగళూరులో ఉంటున్న రాజన్ ఆదివారం రాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అయన వయస్సు 87 సంవత్సరాలుగా తెలిపారు. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అరోగ్యం విషమించడంతో తన తండ్రి మృతి చెందారని ఆయన కుమారుడు అనంత్‌కుమార్‌ తెలిపారు. రాజన్ తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించారు. వాటిలో ముఖ్యంగా తెలుగులో అగ్గి పిడుగు, పూజ‌, పంతుల‌మ్మ‌, మూడుముళ్లు, సొమ్మొకడిది సోకొక‌డిది, ప్రేమ ఖైదీ, రెండు రెళ్లు ఆరు, నాగ‌మ‌ల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగ‌లు.

ఇలా తెలుగులో మంచి సంగీత దర్శకుడిగా పేరు సంపాదించారు. రాజన్ తన సోదరుడు నాగేంద్రతో కలిసి స్వరాలు సమకూర్చేవారు. దీంతో ఇద్దర్నీ రాజన్‌-నాగేంద్ర ధ్వయంగా పిలిచేవారు. ఇక ఆయన సినీ కెరీర్ విషయానికి వస్తే రాజన్ 1952లో విడుదలైన సౌభాగ్య లక్ష్మి సినిమాతో సంగీత దర్శకులుగా తన కెరీర్‌ ప్రారంభించారు. దాదాపు 37 సంవత్సరాలపాటు సినీ ఇండస్ట్రీకి సేవలు అందించారు. దాదాపు 375 సినిమాలకు సంగీతం అందించారు. తమిళ్‌తో పాటు తెలుగు కన్నడ తులు మొదలగు భాషాల్లో ఆయన స్వరాలు కూర్చారు. ఆయ‌న మృతి పట్ల తెలుగు కన్నడ సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags :
|

Advertisement