కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలి ...అభిమానుల డిమాండ్
By: Sankar Sun, 29 Nov 2020 9:34 PM
టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను 0-2తో కోల్పోయిందని విమర్శిస్తున్నారు.
హిట్మ్యాన్ రోహిత్ శర్మ జట్టులో ఉండి ఉంటే భారీ ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేసేవాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, కోహ్లీ నాయకత్వంలో భారత్ వరుస ఓటములు ఎదుర్కొంటున్నదని మండిపడుతున్నారు. వరల్డ్కప్ తర్వాత నుంచి జరిగిన చాలా మ్యాచ్ల్లో భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలేవీ చేయలేదంటున్నారు.
వెస్టిండీస్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లతో సిరీస్ల్లో గెలుపొందడంతో కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారని, అగ్రశ్రేణి జట్లపై కనీస పోటీనివ్వడంలేదని సెటైర్లు వేస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి రికార్డు కలిగిన రోహిత్కు వన్డే, టీ20 బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.