కరోనా రోగులపై రెమ్డెసివిర్ ఎటువంటి ప్రభావం చూపడంలేదు...డబ్ల్యూహెచ్ఓ అధ్యయనం
By: chandrasekar Fri, 16 Oct 2020 8:01 PM
కరోనా వైరస్ చికిత్సకు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెమిడిసివిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి యాంటీ వైరల్ ఔషధాలు
తీవ్ర లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కరోనా రోగులపై రెమ్డెసివిర్ ఎటువంటి ప్రభావం
చూపడంలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో
తేలింది. బాధితులు కోలుకునే సమయం సహా మరణం ముప్పును తగ్గించడంలోనూ ఈ ఔషధం
దోహదపడలేదని నిరూపణ అయ్యింది. కరోనా చికిత్సలో రెమ్డెసివిర్, హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్(రిటోనవిర్), ఇంటర్ఫెరాన్
ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు 30 దేశాలకు చెందిన 11,266 మంది వయోజనులపై డబ్ల్యూహెచ్ఓ క్లినికల్ ప్రయోగాలు
నిర్వహించింది. మరణం ముప్పు తప్పించడం, ఆసుపత్రిలో ఉండే సమయాన్ని తగ్గించడంలో ఈ ఔషధాలు
ఎలాంటి ప్రభావం చూపించడం లేదని ఆ ప్రయోగాల ద్వారా గుర్తించినట్లు డబ్ల్యూహెచఓ
పేర్కొంది. అయితే, ప్రయోగ ఫలితాలను ఇంకా సమీక్షించాల్సి ఉందని
తెలిపింది. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫలితాలపై గిలీద్ సైన్సెస్ పెదవి
విరించింది. ఈ వివరాలు అస్థిరంగా ఉన్నాయని, ప్రకటించిన సమాచారం నిర్మాణాత్మకమైన శాస్త్రీయ చర్చకు
అనుకూలంగా లేదని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా
బాధితులకు చికిత్సా సమయాన్ని రెమిడిసివిర్ ఐదు రోజులకు తగ్గించినట్టు తాము 1,062
మందిపై చేపట్టిన అధ్యయనంలో తేలిందని ఇటీవల గిలిద్ సైన్సెస్ ప్రకటించింది.
కరోనా చికిత్సకు వినియోగానికి అనుమతి పొందిన తొలి
ప్రయోగాత్మక ఔషధం ఇదే కావడం గమనార్హం. అత్యవసర వినియోగానికి అమెరికాకు చెందిన ఔషధ
నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ మే నెలలోనే అనుమతినిచ్చింది. తాజాగా కరోనా వైరస్ బారినపడ్డ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చికిత్సలో కూడా దీన్ని వాడారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్, లోపినవిర్
ప్రభావం చూపడంలేదని తేలడంతో జూన్లోనే ఈ ఔషధాల వాడాకాన్ని నిలిపివేశాం కానీ, 30
దేశాల్లోని 500 ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ కొనసాగాయని
డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. తదుపరి ప్రత్యామ్నాయాల
గురించి ఆలోచిస్తున్నాం.. మోనోక్లోనల్ యాంటీ బాడీలు, ఇమ్యునోమాడ్యులేటర్లు, గత
కొన్ని నెలలుగా అభివృద్ధి చేసిన కొన్ని కొత్త యాంటీ వైరల్ ఔషధాలను
పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు.