Advertisement

  • రిలయన్స్ నుంచి జియో మార్ట్ ..మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే వస్తువులు

రిలయన్స్ నుంచి జియో మార్ట్ ..మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే వస్తువులు

By: Sankar Sun, 07 June 2020 07:45 AM

రిలయన్స్ నుంచి జియో మార్ట్ ..మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే వస్తువులు

ముకేశ్ అంబానీ రిలయన్స్ కంపెనీ ఐది చేసిన సంచలనమే ..తొలుత జియో పేరుతో మొబైల్ నెట్వర్క్ ల విషయం లో సరికొత్త విప్లవం తీసుకొచ్చిన అంబానీ , తాజాగా అదే జియో పేరుతో ఆన్లైన్ ఈ కామర్స్ రంగంలోకి దిగాడు..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పెద్ద నగరాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు నిత్యావసర కిరాణా వస్తువులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ తన ఆన్‌లైన్ ఇ-కామర్స్ వేదిక జియో మార్ట్ ను శనివారం ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఈ రెండు రాష్ట్రాల్లో తొలుత ఎంపిక చేసిన 30 పట్టణాల్లో జియో మార్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు సంస్థ తెలియజేసింది.

తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, బోధన్, ఖమ్మం, పాల్వంచ, మిర్యాలగూడ, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి లలో జియో మార్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, చిత్తూరు, కాకినాడ, గుంటూరు, తిరుపతి, తాడేపల్లిగూడెం, తణుకు, కర్నూలు, వినుకొండ, ఉయ్యురు, అనంతపురం, నర్సరావుపేట, భీమవరం, విజయనగరంలో నివసించే వారు కిరాణా వంటి నిత్యావసర వస్తువులను జియో మార్ట్ నుంచి పొందవచ్చు.

ప్రజలకు తమకు అవసరమైన ఆహార, ఆహారేతర వస్తువులు, పండ్లు, కూరగాయలు, నూనెలు, పప్పులు లాంటి బ్రాండెడ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, పానీయాలు, అంట్లు శుభ్రం చేసుకునేవి లాంటి వస్తువులను అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. వస్తువుల గరిష్ట అమ్మకం ధరకన్నా 5 శాతం తక్కువ ధరకు వస్తువులను అందిస్తామని సంస్థ పేర్కొంది. ఇక వస్తువుల డెలివరీ కూడా చెప్పిన గడువు కన్నా ముందుగానే తక్కువ సమయంలోనే డెలివరీ చేస్తామని తెలిపింది.



Tags :
|
|

Advertisement