అంచనాలకు మించిన లాభాలను నమోదు చేసిన రిలయన్స్...
By: chandrasekar Sat, 31 Oct 2020 3:54 PM
రిలయన్స్ ఇండస్ట్రీస్
జూలై – సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం రూ.9567 కోట్ల లాభం ఆర్జించింది. టెలికాం, రిటైల్
రంగాల్లో సంస్థ ఆదాయం బాగా పెరిగింది. ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో రిలయన్స్
ఇండస్ట్రీస్ సంస్థ రూ.8380 కోట్ల లాభాలను గడిస్తే, రెండో
త్రైమాసికం వచ్చేసరికి అది రూ.9567 కోట్లకు పెరిగింది. దీంతో అంచనాలకు మించిన లాభాలను
రిలయన్స్ నమోదు చేసినట్టైంది.
ఈ ఏడాది జూన్
త్రైమాసికంలో ప్రకటించిన రూ.13,248 కోట్లలో రిలయన్స్ బీపీ మొబిలిటీ కోసం బిపీ సంస్థకు
విక్రయించిన స్టాక్స్ (రూ.4966 కోట్లు) కూడా ఉన్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో
ఆపరేషన్స్ ద్వారా రెవిన్యూ రూ.1,53,384 కోట్లు వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో
అది రూ.1,16,195 కోట్లుగా ఉంది.
తాజాగా ప్రకటించిన
ఫలితాల్లో RIL Q2FY21 EBITDA రూ.18,945 కోట్లు నమోదు చేసింది. ఇదిలాఉంటే, రిలయన్స్
జియో రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. మొత్తం రూ2844 కోట్ల
లాభాలు వచ్చినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 2020 సంవత్సరంలో రిలయన్స్ స్టాక్ మార్కెట్ వద్ద 35 శాతం
వృద్ధి నమోదు చేసింది. సెప్టెంబర్ 16 నాటికి రూ.16 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్కి చేరుకుంది.
ఫలితంగా ఆ సంస్థ షేర్ ధర రూ.2,369.35కి చేరింది.