మెగాస్టార్ కూతురు రూపొందించిన వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల
By: chandrasekar Wed, 09 Dec 2020 11:26 AM
ఆలేరులో జరిగిన
వికారుద్దీన్ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. ఈ వెబ్ సిరీస్ కు
‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ అనే పేరు మీద విడుదలచేయనున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె
సుష్మిత గతంలో పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా
థియేటర్స్ మూత పడడంతో ఆ మధ్య చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాణ
రంగంలోకి అడుగుపెట్టి పలు రకాల వెబ్ సిరీస్లను నిర్మిస్తోంది. ఆమె తన భర్త
విష్ణుప్రసాద్తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను
స్థాపించి తొలి ప్రయత్నంగా ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ను నిర్మిస్తుంది.
ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో లో స్ట్రీమ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ 2015
ఏప్రిల్ 7న
ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎన్కౌంటర్ నేపథ్యం ఆధారంగా ఈ వెబ్ సిరీస్
తెరకెక్కుతుంది.
సుష్మిత నిర్మించిన ఈ
వెబ్ సిరీస్ జీ5లో 8 ఎపిసోడ్స్గా ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే
విడుదలైన ప్రోమోలు ఈ వెబ్ సిరీస్పై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజాగా ఈ వెబ్
సిరీస్కు సంబంధించిన ట్రైలర్ను విడుదల చేసారు. ఇది ఇలా ఉంటే ఈ 'షూట్ అవుట్ ఎట్ ఆలేరు' వెబ్
సిరీస్ పై వివాదం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ రాజకీయ పార్టీ ఈ
సిరీస్ నిర్మాణంపై తీవ్రంగా తప్పుబడుతోంది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్కోసం
నిందితుల కుటుంబాల నుంచి ఈ వెబ్ సిరీస్ దర్శక నిర్మాతలు ఎలాంటీ అనుమతి కూడా
తీసుకోలేదనే ఆరోఫణులున్నాయి. ప్రస్తుతం నిర్మించిన ఈ వెబ్ సిరీస్లో కీలక
పాత్రల్లో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, నందిని రాయ్తో పాటు నిహారిక కనిపించనున్నారు. ఈ వెబ్
సీరిస్కు ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్ సీరిస్లో
మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిసింది. ఓటీటీ లో ఈ వెబ్
సిరీస్ సందడి చేయనుంది.