‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం విడుదల
By: chandrasekar Fri, 17 July 2020 7:22 PM
ప్రపంచంలో తిరగాల్సిన పది
దేశాలు, పది
ప్రాంతాలు, పది నగరాల జాబితాను ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం
విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్కు
దక్కగా రెండో స్థానం ఇంగ్లండ్కు, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు
ఆక్రమించాయి.
ఆ తర్వాత పర్యటించాల్సిన
ప్రాంతాల్లో సెంట్రల్ ఆసియాలోని సిల్క్ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్లోని తొహొకు, అమెరికాలోని
మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని
టెంగారా, భారత్లోని
మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి.
తప్పక చూడాల్సిన పది
నగరాల్లో సాల్ట్బర్గ్, వాషింఘ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీలో బాన్, బొలీవియాలోని
లా పాజ్, వాంకోవర్, భారత్లోని
కోచి, యూఏయీలోని
దుబాయ్, కొలరాడోని
డెన్వర్ నగరాన్ని ‘లోన్లీ ప్లానెట్’ ఎంపిక చేసింది.
కొండలు, గుట్టలు, పచ్చని
వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటాన్ను చూడాల్సిన మొదటి దేశంగా, ‘టైమ్లెస్
ట్రెజర్’గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్లో చారిత్రక కట్టడాలు, చర్చులు
చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు
వేటికి ప్రసిద్ధో, వాటిని ఎందుకు చూడాలో ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకంలో
వివరించింది.