Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ రీ-వెరిఫికేషన్ జవాబు పత్రాల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ రీ-వెరిఫికేషన్ జవాబు పత్రాల విడుదల

By: chandrasekar Tue, 04 Aug 2020 09:30 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ రీ-వెరిఫికేషన్ జవాబు పత్రాల విడుదల


ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల రీ-వెరిఫికేషన్ కమ్ జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను, వాటి రివైజ్డ్ మార్కులను మంగళవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి రీ-వెరిఫికేషన్ జవాబు పత్రాలు https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ రీ-వెరిఫికేషన్ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో ఉంచడంపై ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టత ఇచ్చింది. రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేస్తున్న విద్యార్థులు తమ జవాబు పత్రాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్‌, మార్కుల రీకౌంటింగ్‌కు ఫస్ట్‌, సెకండియర్లకు కలిపి మొత్తం 37,048 దరఖాస్తులు ఇంటర్‌ బోర్డుకు అందాయి. ఇందులో రీవెరిఫికేషన్‌కు 28,742, రీకౌంటింగ్‌కు 8,306 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement