Advertisement

  • ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్‌ను కొట్టిన కరోనా రోగి బంధువులు..

ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్‌ను కొట్టిన కరోనా రోగి బంధువులు..

By: chandrasekar Wed, 29 July 2020 09:36 AM

ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్‌ను కొట్టిన కరోనా రోగి బంధువులు..


తెలంగాణలో వరంగల్‌ నగరంలోని ఎంజీఎం ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసాని కరోనా రోగి బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడ్డ ఘటన జరిగింది. కరోనా రోగి బంధువులు డాక్టర్‌పై చేయి చేసుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ వ్యక్తి చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వార్డులోని అద్దాలను పగల గొట్టారు. దీంతో వార్డులో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.

రోగికి వైద్యుడు చికిత్స అందించ లేదంటూ డాక్టర్‌పై బంధువులు చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కరోనా సమయంలో తమ భద్రతను సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా రోగి బంధువులు వైద్యుడిపై దాడులకు పాల్పడడం విచారించదగ్గ విషయం. రెండు నెలల క్రితం తొలుత గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఈ ఘటనలు జరిగాయి.

తొలుత వైద్యుడిపై దాడి ఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు జూనియర్ డాక్టర్లపైనా కరోనా రోగి బంధువులు దాడికి దిగారు. ఈ ఘటనలతో ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. వైద్యులపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అయినా, ఈ తరహా ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

Tags :

Advertisement