ఐపీఎల్ 2020 విజేతలకు తగ్గిన ప్రైజ్ మనీ
By: chandrasekar Mon, 21 Sept 2020 12:58 PM
కరోనా వైరస్, లాక్డౌన్తో
విసిగిపోయిన ప్రజల్లో ఆనందాన్ని నింపుతూ ఐపీఎల్ 2020 ప్రారంభం అయింది. కరోనా
నేపథ్యంలో యూఏఈలో జరుగుతున్న మ్యాచ్లు 53 రోజుల
పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించడ౦ ప్రారంభించింది. కానీ, ఈసారి
మాత్రం ఆటగాళ్ల ప్రైజ్ మనీని బీసీసీఐ తగ్గించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశం
ఆర్థికంగా వెనుకబడటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐపీఎల్లో గెలిచిన
జట్టుకు రూ.10కోట్లు, రన్నరప్కు రూ.6.25కోట్లు మాత్రమే కానుకగా ఇవ్వనుంది.
2019లో గెలిచిన జట్టు, రన్నరప్లతో పాటు ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అందిన
ప్రైజ్ మనీ వివరాలు...
* విజేత 2019:
రూ. 20 కోట్లు (ముంబై ఇండియన్స్)
* రన్నరప్ 2019:
రూ.12.5కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
* మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 2019: రూ.5లక్షలు(జస్ప్రీత్
బుమ్రా)
* మోస్ట్ వాల్యుబల్ ప్లేయర్ 2019:
రూ.10లక్షలు(ఆండ్రూ రస్సెల్)
* అత్యధిక వికెట్లు 2019: రూ.10లక్షలు(ఇమ్రాన్ తాహిర్, 17 మ్యాచ్ల్లో 26
వికెట్లు)
* అత్యధిక పరుగులు 2019:
రూ.10లక్షలు (డేవిడ్ వార్నర్ 12
మ్యాచ్ల్లో 692 పరుగులు)
* సూపర్ స్టిక్కర్ 2019:
రూ.10లక్షలు (ఆండ్రూ రస్సేల్)
* ఎమర్జింగ్ ప్లేయర్ 2019: రూ.10లక్షలు
శుభ్మన్ గిల్
* క్యాచ్ ఆఫ్ ది సీజన్ 2019: రూ.10లక్షలు
(పొలార్డ్)
* స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ 2019: రూ.10లక్షలు
(కేఎల్ రాహుల్)
* గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ 2019: రూ.10లక్షలు (రాహుల్ ఛాహర్)
* ఫాస్టెస్ట్ ఫిఫ్టీ 2019: రూ.10లక్షలు
(హర్ధిక్ పాండ్యా)
* పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్ 2019: రూ.25లక్షల
చొప్పున (పంజాబ్, హైదరాబాద్)