Advertisement

  • మహిళల టీ20 చాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ రికార్డు విజయం

మహిళల టీ20 చాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ రికార్డు విజయం

By: chandrasekar Fri, 06 Nov 2020 10:59 AM

మహిళల టీ20 చాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ రికార్డు విజయం


మహిళల టీ20 చాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ విజయం సాధించింది. వెలాసిటీతో ఏకపక్షంగా సాగిన పోరులో ట్రయల్‌ బ్లేజర్స్‌ 9 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. వెలాసిటీ నిర్దేశించిన 48 పరుగుల లక్ష్యాన్ని 7.5 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి ఛేదించింది. బ్లేజర్స్‌ అమ్మాయిలు డియాండ్రా డాటిన్‌(29 నాటౌట్‌), రీచా ఘోష్‌(13 నాటౌట్‌) ఆడుతూ పాడుతూ టార్గెట్‌ను కంప్లీట్ చేశారు. ఓపెనర్‌ స్మృతి మంధాన 6 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో బ్లేజర్స్‌ బౌలర్లు అదరగొట్టారు. ట్రయల్‌ బ్లేజర్స్‌ జట్టుకు స్మృతి మంధాన, వెలాసిటీ టీమ్‌కు మిథాలి రాజ్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో 15.1 ఓవర్లలో వెలాసిటీ 47 పరుగులకే ఆలౌటైంది. బ్లేజర్స్‌ బౌలర్ సోఫీ ఎక్లిస్టోన్‌(4/9) సంచలన ప్రదర్శన చేయడంతో వెలాసిటీ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాటపట్టారు. జులన్‌ గోస్వామీ(2/13), రాజేశ్వరీ గైక్వాడ్‌(2/13) బంతితో విజృంభించడంతో వెలాసిటీ కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోయింది. వెలాసిటీ ఓపెనర్‌ షఫాలీ వర్మ(13) టాప్‌ స్కోరర్‌. సునె లూజ్‌(10), శిఖా పాండే(10), కాస్పరెక్‌(11 నాటౌట్‌)‌ మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(1), స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ వేదా కృష్ణమూర్తి(0) ఘోరంగా నిరాశపరిచారు. టోర్నమెంట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు ఇదే. మిథాలీ రాజ్‌ నేతృత్వంలోని వెలాసిటీ జట్టు తమ తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసిన విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement