భారత్లో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు
By: chandrasekar Sat, 12 Sept 2020 12:25 PM
భారత్లో కరోనా కేసులు
రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్కరోజే 96,
551 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 1,209 మంది
మరణించారు. నిన్న 70,880 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి
భారత్లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,62,415కి చేరింది. కరోనాను జయించి 35,42,664 మంది పూర్తిగా కోలుకున్నారు. వైరస్తో పోరాడుతూ 76,271 మంది ప్రాణాలు పోయాయి. ప్రస్తుతం మనదేశంలో 9,43,480 కరోనా యాక్టివ్
కేసులున్నాయి.
గడిచిన 24
గంటల్లో మనదేశంలో 11,63,542 శాంపిల్స్ పరీక్షించారు. భారత్లో ఇప్పటి వరకు 5 కోట్ల
40 లక్షల
97,975 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ
తెలిపింది. మనదేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటి వరకు 9,90,795 మందికి కరోనా సోకగా.. 28,282 మంది మరణించారు. ఇక రెండో స్థానంలో
ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో
ఇప్పటి వరకు 5,37,687 కేసులు నమోదవగా.. 4,702 మంది చనిపోయారు.
తమిళనాడు, కర్నాటక, యూపీలు
ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.