Advertisement

  • దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దీక్ష

దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దీక్ష

By: chandrasekar Thu, 10 Sept 2020 08:48 AM

దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దీక్ష


ఏపీ లో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు దీక్ష చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాల పరిక్షణ కోసం దీక్ష నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంకల్పించారు. దేవాలయాల పరిరక్షణ కోసం నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఈ నెల 11 న ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీక్ష నిర్వహించనున్నారు.

దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా గాంధేయ పద్దతిలో 8 గంటల పాటు దీక్ష చేపట్టబోతున్నట్లు ఎంపీ రఘురామ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 11వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరుగుతుందని ఎంపీ రఘురామ వెల్లడించారు. కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తూ ఢిల్లీ లోని తన నివాసంలో ఈ దీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలోని దేవాలయాలపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

దాడులకు నిరసనగా తాను ఈ దీక్షను చేపట్టడం ద్వారా అధికారంలో వున్న తన పార్టీకి రెబెల్ గా గుర్తించ బడ్డారు. రాష్ట్రంలో జరిగే ఈ సంఘటనలపై ఉన్నతస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ దీక్షా కార్యక్రమానికి కుల, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నైతిక మద్దతు ఇవ్వాలని ఎంపీ రఘురామ కోరారు.

Tags :
|

Advertisement