రియల్ హీరో సోనూసూద్ ఆస్తులను తాకట్టు పెట్టి పేదలకు సాయం
By: chandrasekar Thu, 10 Dec 2020 11:49 PM
తాజాగా ఒక షాకింగ్ న్యూస్
వెలుగులోకి వచ్చింది. సోనూసూద్ రూ.లక్షల్లో సాయం చేస్తున్నాడు. సాయం చేయడానికి తన
చేతిలో ఉన్న డబ్బు సరిపోక ఏకంగా కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టేశాడని
చెపుతున్నారు. వేలాది మంది కార్మికులు, నిస్సహాయులను ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నాడు
బహుభాషా నటుడు సోనూసూద్. వలస కార్మికులను స్వస్థలాలకు పంపడం, అన్లైన్
క్లాసుల కోసం పేద విద్యార్థులకు ఫోన్లు, ల్యాప్టాప్లు అందించడంతో పాటు పిల్లల వైద్యానికి
రూ.లక్షల్లో సాయం చేశాడు. ఇంకా చేస్తూనే ఉన్నాడు. సోనూసూద్కు అయితే ఇంతమందిని
ఆదుకోవడానికి రూ.కోట్లల్లోనే ఖర్చయి ఉంటుంది.
ఓ రాజకీయ నాయకులు ఆయన వెనుకుండి క్రేజ్ కోసమే ఇదంతా చేస్తోందన్న విమర్శలు
చేసారు.
పేదలను ఆదుకోవడం కోసం
ముంబైలోని జూహూ ఏరియాలో తన భార్య పేరిట ఉన్న రెండు షాపులు, ఆరు ఫ్లాట్లను తనఖా పెట్టి రూ.10 కోట్ల రూపాయలు
అప్పుగా తీసుకున్నాడట. ఆ డబ్బుతోనే అందరికీ సాయం చేస్తూ వస్తున్నాడట. దీనిపై జెఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్
సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్, హెడ్
రితేష్ మెహతా స్పందిస్తూ ఆ ఆస్తులన్నీ
సోనూసూద్ అతడి భార్య పేరు మీద ఉన్నాయని, వాటి
మీద వచ్చే అద్దెలు వారే అందుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.10కోట్ల అసలు, దానికి వడ్డీ చెల్లించాల్సి ఉందన్నారు. అయితే దీనిపై
సోనూసూద్ ఇంకా స్పందించలేదు. ఈ వార్త ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
నిజ జీవితంలో ఎంతోమంది జీవితాలను నిలబెట్టిన సోనూసూద్ దేవుడని చాలామంది
పొగుడుతున్నారు.