బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..
By: Sankar Mon, 27 July 2020 12:55 PM
హైదరాబాద్ లోని బాలానగర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐడీఏ గాంధీ పారిశ్రామిక వాడలోని ఓ ఫార్మా స్యూటికల్ పరిశ్రమలో రియక్టర్ పేలంది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.
బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో పేలుడు ధాటికి ఫ్యాక్టరీ మొదటి అంతస్తులోని గోడలు పగిలిపోయాయి. ప్రమాదంపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు.
ఈ మధ్య కాలంలో ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో విశాఖలో ఇటీవల గ్యాస్ లీకేజీ ఘటనలు, ఫార్మా ఇండస్ట్రీలో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలోఇప్పటికే అనేకమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో ఫార్మా కంపెనీల విషయంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కార్మికుల బతుకులకు గ్యారంటీ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.