ఎన్సీబీ విచారణలో రియా సంచలన వ్యాఖ్యలు
By: chandrasekar Wed, 09 Sept 2020 12:56 PM
రియా చక్రవర్తి మూడో
రోజు నార్కోటిక్ బ్యూరో అధికారులు విచారించారు. ఆదివారం నుండి ఈమెని విచారిస్తున్న
అధికారులు అనేక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజా విచారణలో రియా
తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని చెబుతూ, నేను ఏం చేసిన సుశాంత్ కోసమే చేసానని
చెప్పుకొచ్చింది. సుశాంత్తో ప్రేమలో ఉన్న కారణంగా ఇలా చేయాల్సి వచ్చింది. అతనికి
ముందు నుండే డ్రగ్స్ అలవాటు ఉంది. నేను మాన్పించడానికి చాలా ప్రయత్నం చేశాను.
నేను ఎప్పుడు
డ్రగ్స్ తీసుకోలేదు.
కావాలంటే పరీక్షించుకోవచ్చు అంటూ రియా సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇప్పటికే డ్రగ్స్ కేసు
విషయంలో రియా సోదరుడు, సుశాంత్ కుక్తో పాటు పలువురిని కస్టడీలోకి
తీసుకున్న సంగతి తెలిసిందే. రియాకు ఆమె సోదరుడు శోవిక్ చక్రవర్తికి డ్రగ్స్
రాకెట్ తో సంబంధం ఉన్నట్లుగా వెల్లడి అయిన నేపథ్యంలో రియా చక్రవర్తి కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్
అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె తండ్రి స్వయంగా నా కొడుకు అరెస్ట్ అయ్యాడు.
తర్వాత అరెస్ట్ కాబోతున్నది నా కూతురు అనే విషయం నాకు తెలుసు.మధ్య తరగతి
కుటుంబంపై ఏంటి ఈ దౌర్జన్యం అంటూ ఇటీవల
వ్యాఖ్యలు చేశారు.