కోహ్లీ సేనకు షాక్ ..గాయంతో బాధపడుతున్న ఆర్సీబి స్టార్ బౌలర్
By: Sankar Tue, 27 Oct 2020 8:18 PM
ఐపీయల్ 2020 లో దూసుకుపోతున్న కోహ్లీ సారథ్యంలోని ఆర్సీబి జట్టుకు షాక్ తగిలింది...ఆ జట్టు స్టార్ పేసర్ నవదీప్ సైనీ గాయంతో బాధపడటం బెంగళూరు శిబిరాన్ని కలవరపెడుతుంది.. ఆదివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో సైనీ గాయపడటంతో అతను తదుపరి మ్యాచ్లకు ఉంటాడా.. లేదా అనేది అనుమానంగా మారింది.
నిన్నటి మ్యాచ్లో సీఎస్కే ఇన్నింగ్స్లో భాగంగా 18వ ఓవర్ వేస్తున్న సందర్భంలో సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమైంది. దాంతో సైనీ మైదానాన్ని వీడాడు. ఎంఎస్ ధోని స్టైట్గా కొట్టిన షాట్ను ఆపే ప్రయత్నంలో సైనీ బొటన వేలు మధ్యలో చీలిక వచ్చింది. ఇదే ఇప్పుడు ఆర్సీబీని డైలమాలోకి నెట్టేసింది. కీలక మ్యాచ్లకు ముందు సైనీ గాయపడటంతో శిబిరంలో ఆందోళన నెలకొంది.
దీనిపై ఆర్సీబీ చీఫ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాన్ స్పీచ్లీ మాట్లాడుతూ... ‘సైనీ కుడి చేతి బొటన వేలి మధ్యలో చీలిక వచ్చింది. మాకు మంచి సర్జన్ ఉండటంతో సైనీకి కుట్లు వేశాడు. అతని గాయాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాం. ఆర్సీబీ ఆడబోయే తదుపరి మ్యాచ్ల్లో సైనీ ఆడతాడా.. లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది. గాయం నయమవుతుందనే అనుకుంటున్నాం’ అని స్పీచ్లీ తెలిపాడు.