సిక్సర్లతో చెలరేగిన ఎబి , దూబే ..భారీ స్కోర్ సాధించిన ఆర్సీబి
By: Sankar Mon, 28 Sept 2020 9:28 PM
ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, శివం దూబేలు మెరుపులు మెరిపించారు. స్లాగ్ ఓవర్లలో వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55 పరుగులు చేశాడు.
కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన డివిలియర్స్ భారీ షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఏబీ తన దూకుడును చివరి వరకూ కొనసాగించాడు. బుమ్రా, బౌల్ట్ వంటి బౌలర్లున్నా 360 డిగ్రీల ఆటతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్లో దూబే(27 నాటౌట్; 10 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఆర్సీబీ 201 పరుగుల స్కోరును సాధించింది..
అంతకుముందు అరోన్ ఫించ్(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), దేవదూత్ పడిక్కల్(54; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు) మంచి ఆరంభాన్ని అందించారు.టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ తీసుకోవడంతో ఆర్సీబీ బ్యాటింగ్కు దిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ను ఫించ్, పడిక్కల్లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 81 పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఫించ్(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు