Advertisement

  • ఐపీయల్ 2020 లో ఎక్కువగా ఏ ఆటగాడి గురించి ట్వీట్ చేసారో తెలుసా !

ఐపీయల్ 2020 లో ఎక్కువగా ఏ ఆటగాడి గురించి ట్వీట్ చేసారో తెలుసా !

By: Sankar Wed, 18 Nov 2020 8:03 PM

ఐపీయల్ 2020 లో ఎక్కువగా ఏ ఆటగాడి గురించి ట్వీట్ చేసారో తెలుసా !


పీఎల్‌ 2020 విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించిన సంగతి తెలిసిందే. ముంబై వరుసగా రెండో ఏడాది టీ20 లీగ్‌ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా.. ఐదోసారి విజేతగా అవతరించింది.

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై, రన్నరప్‌ చెన్నై తలపడ్డ సీజన్‌ ఆరంభ పోరు గురించి అభిమానులు విపరీతంగా ట్వీట్లు చేశారట. అయితే ఐపీఎల్ 2020లో అభిమానులు అత్యధికంగా ట్వీట్లు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఎలిమినేటర్ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది.

ఇక ఆటగాళ్ల విషయానికి వస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గురించి అభిమానులు అత్యధిక ట్వీట్లు చేశారు. రాజస్థాన్‌ రాయల్స్ పోరులో పంజాబ్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌ ఫీల్డింగ్‌ విన్యాసంపై సచిన్‌ చేసిన ట్వీటు ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. దాదాపు 23,000 సార్లు అభిమానులు దీనిని రీట్వీటు చేయడం గమనార్హం.

Tags :
|

Advertisement