Advertisement

  • వడ్డీ రేట్లలో మార్పులేదన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

వడ్డీ రేట్లలో మార్పులేదన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్

By: chandrasekar Thu, 06 Aug 2020 8:34 PM

వడ్డీ రేట్లలో మార్పులేదన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్


కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా సమావేశంలో వివరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం అయ్యింది. మంగళవారం నుండి గురువారం వరకు కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆర్బీఐ కమిటీ తీసుకున్న నిర్ణయాల గవర్నర్ శక్తికాంత దాస్ ఇవాళ మీడియాకు వెల్లడించారు. ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్లుగా రెపో రేటును తగ్గించలేదని తెలిపారు.

ఆర్ధిక మందగమనం కారణంగా రెపో రేటును 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతం వద్ద యథాతథంగా ఉంచినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. అయితే ఫైనాన్షియల్ మార్కెట్లు పుంజుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంచి వర్షాలు, ఖరీఫ్ విత్తనాల విస్తీర్ణంతో వ్యవసాయ రంగ అవకాశాలు మెరుగుపడినట్లు చెప్పుకొచ్చారు.

బ్యాంకు రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. వీటి రేటు 4.25 శాతంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా నాలుగో నెల మర్చంటైజ్డ్ ఎగుమతులు క్షీణించాయని చెప్పారు శక్తికాంత దాస్. 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందని చెప్పారు. అవసరమైతే తగిన సందర్భంలో మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు.

రెండో అర్ధ సంవత్సరంలో కోలుకుంటుందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ ఆర్‌బీఐ రెపో రేటులో 1.15 శాతంమేర కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తాజా రుణాలపై దేశీ బ్యాంకులు సైతం 0.72-0.8 శాతం మధ్య వడ్డీ రేట్లను తగ్గించాయని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అమెరికాలో వడ్డీ రేట్లు దాదాపు జీరోకు చేరుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వద్ద కూడా వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కొనసాగింది. ఇప్పటికే భారీగా తగ్గాయి. మరింతగా తగ్గిస్తే బ్యాంకింగ్ వ్యవస్థపై పడే ప్రభావాన్ని కూడా నిపుణులు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో రెపో తగ్గింపు రేటు సరికాదని అధికారులు భావించారు. దీంతో ఆ మేరకు వడ్డీరేట్లను యధాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు గత ఎంపీసీ సమావేశాల్లో రెపో రేటును 115 బేసిస్ పాయింట్లు తగ్గించింది. గత ఏడాది ఫిబ్రవరి నుండి మొత్తం 250 బేసిస్ పాయింట్లు తగ్గాయి. కరోనా కారణంగా ఆర్ధిక స్థితి మరింత మంద స్థితిలో ఉన్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement