భాస్కర్రావు హత్య కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్టు
By: chandrasekar Sat, 04 July 2020 10:59 AM
రాష్ట్ర రవాణా, సమాచార
శాఖ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరులు మోకా భాస్కర్రావు హత్య కేసు సంచలన మలుపు
తీసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు
చేశారు.
తూర్పు గోదావరి జిల్లా
తుని మండలం సీతారాంపురం జాతీయ రహదారిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు
అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం వైపు వెళ్తున్న కొల్లు రవీంద్రను
మఫ్టీలో ఉన్న కృష్ణా జిల్లా పోలీసులు మధ్యలోనే ఆపేసి అరెస్ట్ చేసినట్లు సమాచారం.
అనంతరం మాజీ మంత్రిని తుని నుంచి విజయవాడకు తరలించారు. వైఎస్సార్ కాంగ్రెస్
పార్టీ నేత మోకా భాస్కర్రావు హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు
శుక్రవారం అరెస్ట్ చేశారు.
చింతా నాగమల్లేశ్వరరావు, చింతా
వంశీలను అరెస్టు చేసినట్లు మచిలీపట్నం డీఎస్పీ మహబూబ్బాషా తెలిపారు. మోకా
భాస్కరరావు హత్యకేసులో ప్రధాన నిందితుడు చింతా చిన్నీ, చింతా
నాంచారయ్య, చింతా కిషోర్లను గురువారం ఆర్పేట పోలీసులు అరెస్ట్
చేసిన విషయం తెలిసిందే.