గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో రష్మిక
By: chandrasekar Fri, 17 July 2020 5:40 PM
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో
భాగంగా సెలెబ్రీటీలు మొక్కులు నాటుతూ మరో ముగ్గురు నాటాలంటూ ఛాలెంజ్లు విసురుతున్న
విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం కావడంతో పాటు వర్షాలు కూడా కురవడంతో
మొక్కలు నాటే కార్యక్రమం మహా జోరుగా కొనసాగుతోంది.
ఈ ఛాలెంజ్ లో ఇప్పటికే
చాలా మంది సెలెబ్రీటీలు పాల్గొనగా తాజాగా
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని తన మామ నాగార్జునతో కలిసి మొక్కలు నాటిన
సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత మరో టాప్ హీరోయిన్ రష్మిక మందనకు ఛాలెంజ్
విసిరింది.
ఈ ఛాలెంజ్లో భాగంగా
రష్మిక మందన తాజాగా సమంత విసిరిన ఛాలెంజ్ను స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు
నాటింది. అంతేకాదు ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ అభిమానులతో షేర్
చేసుకుంది.
ఈ సందర్భంగా రష్మిక ఈ
ఛాలెంజ్ లోకి ఆహ్వానించిన సమంతకు
కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా
తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ గ్రీన్
ఇండియా ఛాలెంజ్ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చింది.
ఇక ఛాలెంజ్లో భాగంగా తన
తోటి హీరోయిన్లైనా రాశీ ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి
మొక్కలు నాటాలని కోరింది.