Advertisement

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో రష్మిక

By: chandrasekar Fri, 17 July 2020 5:40 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో రష్మిక


గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సెలెబ్రీటీలు మొక్కులు నాటుతూ మరో ముగ్గురు నాటాలంటూ ఛాలెంజ్‌లు విసురుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం వానాకాలం కావడంతో పాటు వర్షాలు కూడా కురవడంతో మొక్కలు నాటే కార్యక్రమం మహా జోరుగా కొనసాగుతోంది.

ఈ ఛాలెంజ్ లో ఇప్పటికే చాలా మంది సెలెబ్రీటీలు పాల్గొనగా తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అక్కినేని తన మామ నాగార్జునతో కలిసి మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంత మరో టాప్ హీరోయిన్ రష్మిక మందనకు ఛాలెంజ్ విసిరింది.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా రష్మిక మందన తాజాగా సమంత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటింది. అంతేకాదు ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ అభిమానులతో షేర్ చేసుకుంది.

ఈ సందర్భంగా రష్మిక ఈ ఛాలెంజ్ లోకి ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఇదేవిధంగా కొనసాగించాలని పిలుపునిచ్చింది.

ఇక ఛాలెంజ్‌లో భాగంగా తన తోటి హీరోయిన్లైనా రాశీ ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరింది.

Tags :
|
|

Advertisement