Advertisement

ప్రయాణిస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం

By: Anji Mon, 31 Aug 2020 09:57 AM

ప్రయాణిస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం

ఢిల్లీ: 46మందితో ప్రయాణిస్తున్న బస్సులో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సు వెళ్తుండగా ఈ ఘాతుకం జరిగినట్లు బాధితురాలు తెలిపింది. 30 ఏళ్ల సదరు యువతి.. లక్నో నుంచి ఢిల్లీ వస్తోంది.


స్లీపర్ బస్సులో నిద్రిస్తుండగా.. బస్సు క్లీనర్ ఆమెను బలాత్కరించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో బస్సులో 46మందిపైగా ప్రయాణికులున్నారని ఆమె చెప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :
|

Advertisement