- హోమ్›
- వార్తలు›
- రణబీర్ కపూర్,రణవీర్ సింగ్ లు డ్రగ్ టెస్ట్ చేయించుకుని అభిమానులకు ఆదర్శంగా నిలవాలి: కంగనా
రణబీర్ కపూర్,రణవీర్ సింగ్ లు డ్రగ్ టెస్ట్ చేయించుకుని అభిమానులకు ఆదర్శంగా నిలవాలి: కంగనా
By: chandrasekar Fri, 04 Sept 2020 11:33 AM
కంగనా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య గురించి బాలీవుడ్ ప్రముఖులపై ఇప్పటికే అనేక ఆరోపణలు చేసింది. ప్రస్తుతం సుశాంత్ కేసులో డ్రగ్ బాంబ్ పేల్చింది.
సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తికి డ్రగ్ సప్లైయర్స్తో సంబందాలు ఉన్నాయని ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో కంగనా మాట్లాడుతూ.. బాలీవుడ్లో 99 శాతం డ్రగ్స్ తీనుకుంటారని పేర్కొంది.
ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్రమైన చర్చలకు దారితీసాయి. అది అలా ఉంటే ఇప్పుడు మరోసారి కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది కంగనా.
స్టార్ హీరోలయిన రణవీర్ సింగ్ రణబీర్ కపూర్ అయాన్ ముఖర్జీ విక్కీ కౌశల్లు డ్రగ్స్ కు బానిసలయ్యారు అనే ఆరోపణలు ఉన్నాయని వారు డ్రగ్ టెస్ట్ చేయించుకుని వారిని ఆరాధించే లక్షలాది అభిమానులకు ఆదర్శంగా నిలవాలని ట్విట్టర్ ద్వారా ఆమె కోరింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.