Advertisement

  • పవర్ స్టార్ తో స్క్రీన్ పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ...రానా

పవర్ స్టార్ తో స్క్రీన్ పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ...రానా

By: Sankar Mon, 21 Dec 2020 2:00 PM

పవర్ స్టార్ తో స్క్రీన్ పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ...రానా


పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా మలయాళీ సూపర్‌హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతోంది.

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం 12గా ఈ సినిమాను రూపొందిస్తుంది. ఈరోజు పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు...ఇప్పటికే వకీల్ సాబ్ ఫైనల్ స్టేజి షూటింగ్ లో ఉంది ..అది కంప్లీట్ అవ్వగానే పవర్ స్టార్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పాల్గొనే అవకాశం ఉంది..

ఇక పవన్‌ సినిమాలో భాగమైనందుకు రానా సంతోషం వ్యక్తం చేశారు. ‘ఇప్పటివరకూ పలు పరిశ్రమలకు చెందిన ఎంతోమంది స్టార్స్‌తో కలిసి పనిచేశాను. కానీ ఇప్పుడు మన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. మరో ప్రయాణం ప్రారంభమైంది. సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అని రానా ట్వీట్‌ చేశారు.

Tags :
|

Advertisement